Thursday, July 16, 2009

కృష్ణశాస్త్రి కావ్య సౌందర్యము

దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు ఆధునికాంధ్ర సాహిత్యంలో పారిజాతనికుంజం వంటి చోటు. లలిత కోమల కాంత పదావళితో భారతీయ సాహిత్యంలో జయదేవుని స్థాన మెల్లాంటిదో ఆధునికాంధ్ర సాహిత్యంలో శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో కృష్ణశాస్త్రిదీ అల్లాంటిదే. ఈ శతాబ్దంలో భావ కాల్పనిక కవితా ప్రస్థానం ప్రారంభించిన రాయప్రోలు, గురజాడల మార్గంలో ఒక భావుకతా శిఖరం నిర్మించిన కవి వతంసుడు కృష్ణశాస్త్రి `తలిరాకుజొంపముల సందుల త్రోవల నేలవ్రాలు తుహినకిరణ కోమలరేఖ'యై తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రి పద్యం వినూత్న అభివ్యక్తి లోకాలకు తలుపులు తెరచింది. ఆధునిక నాగరతతో వ్యస్తమైన జీవనంలో సహజమైన ప్రకృతితోడి సామరస్యం గల జీవనం నుంచి, దూరంగా తొలగిపోయిన ఈనాటి మానవుడు మళ్ళీ ప్రకృతి తోడి తాదాత్మా్యన్ని వాంఛిస్తున్నాడు. ఈ తాదాత్మ్యం కోసం ఈ సభ్యతల వలలో చిక్కుకుని పోయిన మిగిలిన వారికంటే తా నొంటరి తనాన్ని పొంది ప్రకృతి ెుుక్క నిసర్గమైన సాన్నిధ్యంలోకి వెళ్లాలని ప్రయత్నం ప్రారంభించాడు. `ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా' అని ప్రశ్నించుకున్నాడు ఈ భావ యాత్రలో కవి గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై తరులెక్కి అల నీలగిరినెక్కి మెలమెల్ల చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై పరిణమించాలని సంకల్పించాడు. నేల విూద నుంచి నింగిదాకా ప్రాకి అన్ని చైతన్యస్థానాలలో తానే అదై, అన్నీ తానై పోవాలని భావన చేస్తున్నాడు. ఈ భావతాదాత్మ్య దశలో వ్యష్టియైన తన వ్యక్తిత్వం సమష్టిలో లీనమవుతున్నది. అప్పుడు తనకు మిగిలేది `సర్వభూతస్థ మాత్మానం, సర్వభూతాని చాత్మని పశ్యతే (ెుూగయుక్తి) వ్యష్టి బిందువు నుండి సమష్టి సముద్రంలోనికి చేసే మహాప్రయాణం. అందువల్ల జగత్తు తోడి తాదాత్మ్యం సులభంగా సిద్ధిస్తుంది. కాల్పనిక కవితాతత్త్వం ఈ స్థితికి చెందిందే. మనోలోకంలో సమష్టివ్యధలు, బాధలు కల్లోలాలు అన్నీ కవిలో ఆత్మీయతను పొంది, గాఢదశలో అభివ్యక్తమవుతవి. ఈ సర్వత్ర సమదర్శనమన్న స్థితిని పొందటానికి కవి ఎంతో ఒరిపిడిని పొందవలసి ఉన్నది. అది ఒక ఏకాంతస్థితి `ఆకలా దాహమా చింతలా వంతలా ఈ కరణి వెర్రినై ఏకతమ తిరుగాడ' భావుకులుకాని అన్నమయ ప్రాణమయకోశాలకు నిబద్ధులైన వారికి ఈ బాధ, ఘర్షణ, ఉన్న స్థితితో అసంతృప్తి మొదలైన అంశాలు పొందే విలక్షణుడైన కవిని చూచినప్పుడు వెర్రివాడుగానే గోచరిస్తాడు. ఏ మార్గంలోనైనా ఈ స్థితి ఉండనే ఉన్నది. వర్తమానంలో ఉన్న ఈ దుఃఖం వల్ల, కట్టుబడుల వల్ల సంకుచితుడైన మానవుడు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నాడు. ఈ దాస్యశృంఖలాలు క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్యశృంఖలాలు. ఇవి తమంత తామే చెదరిపోవాలి. జీవితంలోని దుఃఖాన్ని గుర్తించడంలో కాల్పనికవులు బుద్ధదేవుని వలె లోకాన్ని దర్శించారు. దుఃఖం నుండి విముక్తి వాళ్లకు లక్ష్యమైంది. అయితే దుఃఖమూలంలోకి వెళ్లినప్పుడు వాళు్ల ఈ వేదనలన్నీ అనుభవించవలసి వచ్చింది. ఈ గాఢమైన మనస్సులోకి, అగాధంలోకి తమంత తాముగా ప్రవేశించి ఆ గాఢాంజన గర్భంలోనుంచి చీల్చుకుంటూ పైకి రావలసి వచ్చింది. అప్పటి స్థితి తిమిరలత తారకా కుసుమములు తాల్ప కర్కశశిలయు నవజీవ కళల దేర మ్రోడు వెుూక చివురులెత్తి మురువు సూప నున్న స్థితి తిమిరిలత అన్న స్థితి అగాధమై సృష్టిపరిణామం ప్రారంభంకాని సృష్టి దేవాలయంలో చిరుదీపం కూడా వెలుగని సంకల్ప పూర్వదశ కావచ్చు. రెండవది సంపూర్ణమైన కఠిన శిలాస్థితి. మూడవది చైతన్య స్పందం స్ఫురించే వ్రెుూడు వెుూక, ప్రాణ వికాసంలో క్రమ దశ ఈ విధంగా వ్యక్తమౌతున్నది. ఇలా మూల ప్రకృతిలోకి, దుఃఖ గర్భంలోకి ప్రవేశించి దాని నుండి సంఘర్షించి నూత్న జగత్తును స్పష్టించే సంకల్పంతో ఆ పరిమితులను ఛేదిస్తూ పురోగమనం చేయటం కాల్పనిక కవిత్వానికి పరమలక్ష్యమయింది. ఈ స్థితిలోని పరిణామదశలు ఎన్ని ఉన్నవో అన్నింటినీ స్పష్టరేఖలతో వ్యక్తం చేసిన కవి కృష్ణశాస్త్రి. `యుగయుగంబుల నీశ్వర యోధులగుచు' ఈ వ్యక్తులు స్వేచ్ఛకై తమ ప్రాణ సుమములు అర్పిస్తున్నారు. ఇందువల్ల అమల జీవిత ఫలము ధన్యతను పొందుతున్నది. ఇంతటి ఘర్షణ ఫలితం సామాన్యమైందికాదు. జగత్తు తనతో పాటు పరిణామానికి ఉన్ముఖమై తన పరిమితులనుండి ఉన్ముక్తమై వెంట వస్తూ వున్నది. భయము కలిగించు కష్టాతపంబు మరచి కరము కలగించు వంత చీకట్లు మరచి విశ్వమే పరవశమయి వెంటరాగ తాను ఈశ్వర యోధుడై ముందుకు సాగగా తన వెంట పరవశమయిన జగత్తు కదలి వస్తున్నది. జగత్తులోని దుఃఖాన్ని తొలగించటమే ఈశ్వర యోధుని లక్షణం. ఈశ్వరాభిముఖంగా ఈ జగత్తు పొందే పరిణామక్రమాన్ని వేగిరపరచి దానికి ఆనందమయస్థితిని కలిగింప జేసేందుకు మార్గం వేయటమే కవియైన ఈశ్వర యోధుని ప్రవృత్తి. ఈ ఈశ్వర యోధుని ఉన్ముక్తమైన ఉన్మాదప్రాయమైన దశ `స్వేచ్ఛాగాన'మన్న రెండవ ఖండికలో వ్యక్తమౌతున్నది. `పక్షి నెు్వద చిన్న ఋక్షమెు్యదను, మధుపమెు్యద చందమామ నెు్యదను, మేఘ మెు్యద వింతమెరపు నెు్యదను అలరు నెు్యద చివురాకు నెు్యదను' అంటూ `మాయ మెు్యదను నా మధుర గానమున' అంటాడు. తనకూ తన గానానికీ అభేదం. ఆ స్థితి పొందిన వారికి మళ్ళీ ప్రకృతి ఆవరణంలోకి వచ్చే అవసరం ఉండదు. వాళు్ల జీవన్ముక్తులు, అందుకే అంటారు కవి `దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అని అంటే ఆ చైతన్య పరిమితిలోనికి తిరిగిరానని తాత్పర్యం. కవి అనేక చిత్తస్థితులను వర్ణిస్తాడు. లోకంలో వైరుధ్యం ఉన్నది. సుఖ దుఃఖాలు ఉన్నవి. సుఖముగా ఉన్న దశలో అట్టడుగున ఉన్న దుఃఖాన్ని గుర్తించగలగితే ఈ దుఃఖ స్పర్శలేని స్థితి కోసం పరితపించే దశ వస్తుంది. వైరుధ్యాల వల్ల సంక్లిష్టమైన దశ ఉంటుంది. ఏది ఏమిటో గుర్తించలేము. అమల మోహన సంగీత మందు హృదయ దళన దారుణ రోదన ధ్వనులవిందు ఈ అనిత్యమైన నిరంతర పరిణామ శిథిలమైన జీవితం నుండి జీవుడు ఈశ్వర చైతన్యంలోకి విశ్రాంతి పొందే ఒక దశను కవి వర్ణిస్తాడు. నీలభ్రసరసిలో నిండు జాబిల్లి రాయంచవలె నిహారము సల్పుచుండె కమ్మతెమ్మరలు శాఖా పత్రములనొ కల్లోలినీ తరంగములనో దాగె నాట్యంబు మధుర గానంబును మరచి గాటంపు నిద్దురగాంచె శైవలిని సర్వేశ్వరుని హస్త జలజ యుగ్మమున విశ్వమే హాయిగా విశ్రాంతి జెందె ఈ వర్ణన మాండూక్యములో వర్ణించిన అవస్థాత్రయంలో మూడవ దశను సంబంధించింది. జాగ్రత్స్వప్న సుషూప్తిదశల్లో అనుభవస్థానమైన పురుషూని క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ భోక్త ప్రాజ్ఞదశలో ఉన్నప్పటి దశ. ఈ ఖండికలో వర్ణితమైంది. సామాన్య దశలో ఉండగా ప్రేరకమైన భావం ఎక్కడినుంచో అపూర్వమైంది స్ఫురిస్తుంది. అతని పాట అన్న గీతంలో `మందమలయానిలోర్మికా మాలికలను లలిత సుకుమార మధుర బాలస్వరంబు నెత్తి, పాడితి వేమేమొ హృదయ కమల వికస నోద్భోధకంబగు వింతగీతి' అప్పుడు తన అనుభవం ఎలా ఉందో వెంటనే వివరిస్తాడు కవి. `సందె వేళ పొలముగట్టు, చల్లగాలి చేతిలో చేయి నునులేత చిత్రములును, ఈవు నేను పిట్ట లటుల నేమియనక, సర్వమును జేర నొక్క యపూర్వభావ ముదయమెు్య కుమార నా హృదయమందు' `మొగముగంటి కనులగంటి మొగిలుగంటి పాటవిను చుంటి' ఈ విలక్షణమైన దశలో అనుభవిస్తున్న కవీ, పాడుతున్న కుమారుడూ ఇద్దరే ఉన్నారు. `ఈవునేను పిట్ట లటుల' అంటే జీవేశ్వరులను పక్షులుగా వర్ణించిన శ్రుతి తప్పక స్మరించబడుతుంది. `ద్వాసవర్ణా సయుజా సఖాయ' అని. విశ్వనాథ ఈ కాలంలోనే `ఈ అనిలాధ్వమందు నినదించెడు మువ్వల మ్రోత దూరమై పోయిన గోతతిన్‌ పిలుచు పోలిక యేదొ వినిస్వనించెదున్‌' అన్నిచోట ఈ అవ్యక్త లోకపు ఆహ్వాన గీత స్ఫురణను వర్ణించినాడు. ఈశ్వర భావవేళ దీనుడైన ఈ జీవుని పరిస్థితిని రవీంద్రుడు గీతాంజలిలో వర్ణించినాడు. కృష్ణశాస్త్రి ఒక గీతంలో ప్రసవ కోమల రమణీయ పథము బట్టి పోవుచుందువు లావణ్యమూర్తి నీవు ఏనొ దీనుడ, నే నీడనైన నొదిగి అడుగిడగ లేక నిట్టూర్పువిడువలేక పొరలు కన్నీటి కాల్వలు కురియలేక మ్రోడునై రాయినై నిల్చిపోదు నకట ఇక్కడ పరిణామానికి ముందు జీవుడు రాయిగా మ్రోడుగా నిలిచివున్న దశలను నీడలో నొదిగి ఉండటం, ప్రకృతి పరిమితుల్లో దుఃఖమయజగత్తులో మిగిలి పోవటాన్ని సూచిస్తుంది. బ్రహ్మసమాజ భావన కృష్ణశాస్త్రి కవిత్వానికి ఆధారపీఠం, విశిష్టాదై్వతంలోని సగుణోపాసన స్థానంలో నీరూపమైన ఈశ్వరభావన నిలిపితే బ్రహ్మభావన నిలచి వుంటుంది. అందుచేత ఈశ్వర శరణాగతి వల్ల ఎటువంటి జీవునికైనా నిష్కృతి ఉన్నదనే తత్త్వమార్గం బోధిస్తుంది. ఈశ్వరుడు దోషభోగ్యుడు. ఈశ్వరుని ఈ లక్షణమే అతనిని మనకు నిత్యసన్నిహితుణ్ణి చేస్తుంది. `మలినబాష్ప మౌక్తినము్మ మిలమిల నీ కనుల నిలువ, తళతళమని తారలు నటియించునురా పాపీ !' `కురియుమురా కన్నీటి మరిమరి విలపింపుమురా సరముగూర్చి పరమేశుడె తాల్చునురా పాపీ' శరణాగతి అనన్య గతికత్వము ఈ రెండు లక్షణాలే జీవుణ్ణి ఈశ్వరుని దగ్గరకు చేర్చే అంశాలు. అప్పుడు జీవుని మలినాశ్రుధార పరమపావన జాహ్ననీ ప్రతిభగాంచుతుంది. తావకీన పదసరోజ దళములందు నిలువ నిమ్మొక్క వేడి కన్నీటి చుక్క కడల ప్రసరించు నెత్తావి కమ్మదనము త్రావనివెుూ్మ ప్రభూ ! దాని తనివితీర ఈ జీవయాత్ర పరిమితిలో కృష్ణశాస్త్రి దుఃఖం సమష్టిజీవ దుఃఖమే కాని లౌకికమైన దుఃఖం కాదు. దానికి పరమమైన గమ్యం ఈశ్వర ప్రాప్తి. అవధరింతువు ప్రతి దివసాంతవేళ నిత్య నూతన తాండవ నృత్యకేళి ఓంుు నటరాజ తలలైన ఉపలేక భువనములు దుర్భరానందమున నడంగ ఆటలో పాటలో నేర్చినట్లు దేవ ఏనుగూడ నీవలె నటియింపనిము్మ ఎడతెగని యాత్ర నెట్లొ సాగించు వరకు ఎట్లొ నీ దర్శనము్మ సాధించు వరకు కృష్ణశాస్త్రి చెప్పిన ఈ అనంత యాత్ర సర్వజీవుల యాత్రయే. కాల్పనిక కవిగా కృష్ణశాస్త్రి కవిత్వం విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. ఒక పరిమితుల్లో విమర్శకులు దీన్ని భావకవిత్వం అని పిలిచారు. ఆత్మాశ్రయధోరణిలో సాగిన మార్గంలో ఈ కవిత్వంలో ప్రధానస్థానాన్ని ప్రేమ ఆక్రమించింది. ఈ ప్రేమ ప్రకృతికీ, స్వేచ్ఛకూ ఈశ్వరుడికీ పరిమితం కాకుండా స్త్రీ పురుష సంబంధాన్ని విలక్షణంగా విచారించింది. సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు, ధర్మ స్ఫూర్తి కోల్పోయిన వివాహవ్యవస్థ కాఠిన్యాన్ని, మౌఢ్యాన్నీ స్త్రీ పురుషూలకు సమాన స్థానం లేక పోవటాన్నీ కల్పించినప్పుడు స్త్రీపుంసయోగంలో ప్రేమకు పట్టాభిషేకం చేసిన ఘనత భావ కవిత్వానిది. స్త్రీని కేంద్రంగా ఆరాధ్య దేవతగా భావించి ఈశ్వర స్థానం కల్పించే వరకూ ఈ కవిత్వం ప్రవర్తించింది. కృష్ణశాస్త్రి వివాహవ్యవస్థ కన్నా స్త్రీ పురుషూల మధ్య స్వేచ్ఛనూ ప్రణయాన్నీ లక్ష్యంగా ప్రతిపాదించినాడు. ప్రేయసిని `తానే సృష్టించుకొన్నాడట. ఎలాగ? తన మనస్సుకు ఎన్నడో ఎక్కడో సోకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ, తన హృదయాన్ని ఎన్నడో పలకరించిన ప్రతిప్రేమ శకలాన్నీ ఏరి ఏరి తెచ్చుకుని, అన్నిటినీ కలిపి కలిపీ ఆమెను సృష్టించు కున్నాడట' ఈ మాటలు కవి చెప్పినవే. ఈ ప్రేయసి నితాంత వియోగిని, నిశీధిని, కఠోర ప్రణయశాలిని. అలాంటి ఆమెను గూర్చిన తన అన్వేషణము అనంతమైంది. ఈ భావసుందరిని నిజజీవితంలోకి సాక్షాత్కరించుకునే పని కృష్ణశాస్త్రి కవిత్వం సూచించదు. ఇది ముగియబోని, ఏ యర్థమెరుగరాని వేసటేలేని వెర్రి యన్వేషణము్మ ఈ ప్రవాస యాత్రారతి నిటులె నేను కదలిపోవుదు నాశావకాశములకు ఒక్కనిట్టూర్పు వోలిక ఒక్క మౌన బాష్పకణమటు, ఒక గాఢ వాంఛపగిది ఇంత నూతనాభివ్యక్తి సముదాయంతో కృష్ణశాస్త్రి తెలుగుకవిత్వానికి నూతన దిశాభిగమ్యం నేర్పాడు. తానే ఈ మార్గంలో కవులందరికీ గురుపీఠమైనాడు.

No comments:

Post a Comment